నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఈరమ్మ స్వర్గస్థులయ్యారు. దీంతో ఆమె స్వగృహంకి వెళ్లి ఆమె పార్థివ దేహం పై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, రజినీకాంత్, ఇమామ్ , రూప పాల్గొన్నారు.