షేక్ పేట్ నాగదేవత ఆలయంలో మానవహక్కుల సంఘం సభ్యుల ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: దసరా నవరాత్రోత్సవాలను పురస్కరించుకు‌ని మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి షేక్ పేట్ నాగదేవత ఆలయంలో అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి కోసం ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులు రూ. 12,116 చందా డబ్బులు కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం నిర్వహించిన హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా వింగ్ చైర్మన్ బొమ్మిరెడ్డి సంధ్యారెడ్డి, రేసు స్వప్న, సరస్వతి, గణిత తదితరులు పాల్గొన్నారు.

షేక్ పేట్ నాగదేవత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న మానవహక్కుల సం‌ఘం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here