ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నిండాలి: ఎంపీ రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞాన దీపాలను వెలిగించే తేజోత్సవంగా, చెడుపై మంచి సాధించిన విజయకేతనంగా అవనికంతా ఆనంద విజయోత్సాహంగా జరుపుకునే పండగ దీపావళి పండగ అని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మరింత సుఖసంతోషాలను వెదజల్లేలా విరజిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరికి ఎంపీ రంజిత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా టపాసులు పేలుస్తూ ప్రమాదాల బారిన పడకుండా పండగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here