సంకష్ట చతుర్థిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పా ఎన్ క్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో ఆదివారం సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం, 10గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సిద్ది బుద్ది సమేతవరసిద్ధి వినాయక స్వామి కల్యాణ మహోత్సవం జరిపించారు. రాత్రి 8.30 గంటలకు ప్రసాద్, శాంతి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంకష్ట చతుర్థి కావడంతో విఘ్నేశ్వరున్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here