ఇజ్జత్ నగర్ బస్తీలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి

నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్ నగర్ బస్తీ కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతున్నది, కరెంటు సౌకర్యం లేక విలవిల్లాడుతున్నది. బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తెలుసుకున్న సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి టి రామకృష్ణ, ఏఐటియుసి శేరిలింగంపల్లి కార్యదర్శి కే చందు యాదవ్, తదితర నాయకులు ఇజ్జత్ నగర్ బస్తీలో తక్షణమే కరెంటు సమస్యలను పరిష్కరించాలని మాదాపూర్ డివిజన్ ఏఈ శ్రీను నాయక్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఐదు సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసిన పంచ్ కేబుల్ ను మార్చాలని, కెపాసిటీకి సరిపడా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరగా ఏఈ సానుకూలంగా స్పందించారు. వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మాదాపూర్ డివిజన్ ఏఈ శ్రీను నాయక్ ని కలిసి వినతి పత్రం అందిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here