చంద్రబాబు గెస్ట్ హౌజ్ వద్ద బైక్ ను ఢీకొట్టి‌న వాటర్ ట్యాంకర్ – మార్గమద్యలో ద్విచక్రవాహనదారుడు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: అతివేగంతో నిర్లక్ష్యంగా ఎలాంటి సూచిక చేయకుండా వాటర్ ట్యాంకర్ మూలమలుపు వద్ద తిప్పడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందడంతో మరో వ్యక్తి గాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన గోవింద్ కుమార్ తన స్నేహితుడు సురేష్ కుమార్ (18) తో కలిసి కొండాపూర్ మజీద్ బండ నుంచి టీఎస్ 07జీఎన్ 4450 నంబర్ గల ద్విచక్ర వాహనంపై హఫీజ్ పేటకు వెళ్తున్న క్రమంలో ఏపీ05టీటీ 5984 నంబర్ గల‌ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మజీద్ బండ నుంచి చంద్రబాబు గెస్ట్ హౌజ్ కు అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ మూలమలుపు వద్ద ఎలాంటి సూచిక వేయకుండా వెళ్లి బైక్ ను ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న గోవింద్ కుమార్, సురేష్ కుమార్ కు‌ తీవ్రగాయాలకు గురయ్యారు. వీరిద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో సురేష్ మృతిచెందాడు. గోవింద్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోవింద్ తమ‌ బంధువైన గేవారంకు సమాచారం అందించడంతో హుటాహుటిన‌ ఆస్పత్రికి వచ్చారు. గేవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి‌ మృతిచెందిన‌ సురేష్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here