గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ పోలీసుల‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈవిధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్ మెయిన్ రోడ్డు ప‌క్క‌న‌ ఓ వ్య‌క్తి మృత‌దేహం ఉంద‌న్న స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆ వ్య‌క్తి వివ‌రాలు ప‌రిశీలించేందుకు జేబుల‌ను త‌నిఖీ చేశారు. కానీ అత‌ను ఎవ‌రు అనే ఆచూకీ ల‌భించ‌లేదు. ఈ క్ర‌మంలో ఆ మృత‌దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడు నలుపు రంగు జీన్ ప్యాంటు, బ్లూ క‌ల‌ర్ చొక్కా ధ‌రించి ఉన్నాడ‌ని, ఎవ‌రైనా గుర్తు పట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here