ఎస్సైని దూషించిన ముగ్గురు వ్య‌క్తుల అరెస్టు

చందాన‌గ‌ర్ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ ఎస్సై ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా, ఆ ఎస్సైని అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషించినందుకు ముగ్గురు వ్య‌క్తుల‌పై చందాన‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసి వారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల అదుపులో నిందితులు

ఈ నెల 23వ తేదీన బుధ‌వారం రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ రాములు శేరిలింగంప‌ల్లి మున్సిప‌ల్ ఆఫీస్ ఎదుట పెట్రోలింగ్ విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అదే స‌మ‌యంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డే రోడ్డుపై మ‌ద్యం సేవించ‌సాగారు. వారిని గ‌మ‌నించిన ఎస్సై రాములు అక్క‌డ మ‌ద్యం తాగ‌వ‌ద్ద‌ని, వారిని ఇంటికి వెళ్లాల‌ని సూచించాడు. కానీ ఆ ముగ్గురు విన‌కుండా ఎస్సైపై దుర్భాష‌లాడారు. అత‌ని ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో ఆ ముగ్గురిపై చందాన‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కాగా ఆ ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్య‌క్తి చందాన‌గ‌ర్‌లోని డోయెన్స్ కాల‌నీలో నివాసం ఉండే కాంట్రాక్ట‌ర్ ద‌త్త ఆదిత్య (31) కాగా మ‌రొక వ్య‌క్తి సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులోని రామ మందిర్ రోడ్డులో నివాసం ఉండే ఐఎస్‌బీ విద్యార్థి మాద్రి పృథ్వి (29)గా గుర్తించారు. ఇంకో వ్య‌క్తిని గచ్చిబౌలిలోని సుద‌ర్శ‌న్ న‌గ‌ర్‌లో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి భ‌ల్లం ర‌వి (31)గా గుర్తించారు. ఈ మేర‌కు ఈ ముగ్గురిపై చందాన‌గ‌ర్ పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 353 ప్ర‌కారం కేసు న‌మోదు చేసి వారిని అరెస్టు చేశారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here