చ‌దువుపై దృష్టి సారించ‌లేక‌… 9వ అంత‌స్థు నుంచి దూకి 12వ త‌ర‌గ‌తి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌…

నమస్తే శేరిలింగంపల్లి: చ‌దువుపై దృష్టి సారించ‌లేక‌ మానసిక ఒత్తిడికి లోనై 12 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఎస్ఐ ర‌వికిర‌ణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పరిధిలోని మై హోం జెవేల్ అపార్ట్మెంట్ టార్కైస్ బ్లాక్‌లో వీరేందర్ సింగ్, సోనియా నేగి కుటుంబం రెండేళ్లుగా నివాసం ఉంటోంది. వీరికి ఒక కూతురు జాహన్వీ నేగి, ఒక కుమారుడు తరుణ్ ఉన్నారు. కుమారుడు తరుణ్ తొమ్మిద‌వ‌ తరగతి చదువుతుండగా కూతురు జాహన్వి నేగి(17) సీబీఎస్ఈ 12 వ తరగతి చదువుతోంది. ఐతే జాహ్న‌వి చ‌దువుపై దృష్టి సారించ‌లేక పోతుంది. ఈ క్ర‌మంలో మానసిక ఒత్తిడికి గుర‌వుతు వ‌స్తుంది. అది తట్టుకోలేక ఈ నెల 18వ తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వారు నివాసం ఉండే 9 వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్న‌వి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు.

జాహన్వి నేగి (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here