కోవిడ్ తో మియాపూర్ ఏఎస్సై మృతి..!

మియాపూర్: పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథన్ కొవిడ్ తో మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ప్రాంతానికి చెందిన విశ్వనాథన్ 1987లో కానిస్టేబుల్ గా పోలీసు ఉద్యోగంలో చేరి తాండూరు, మొయినాబాద్, వికారాబాద్, పహాడీ షరీఫ్, సరూర్ నగర్, కుషాయిగూడ, సనత్ నగర్, మాదాపూర్ లలో పని చేసిన ఆయన ఏఎస్సై గా పదవోన్నతి పొంది మియాపూర్ స్టేషన్ కు బదలీ అయ్యారు. పలు పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు విశ్వనాథన్ మృతికి సంతాపం ప్రకటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here