చందానగర్ లో వృద్ధుని హత్య

నమస్తే శేరిలింగంపల్లి: కూలర్ షాపులో పనిచేస్తున్న ఓ వృద్ధుడు హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో బుధవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చందానగర్ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో‌ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కూలర్ షాపులో మలక్ పేటకు చెందిన మహ్మద్ ఇబ్రహీం ఖాన్ (70) అనే వృద్ధుడు పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు షాపు యజమానులు, చుట్టు పక్కల వారు ఉండి ఇంటికి వెళ్లిపోయి తిరిగి బుధవారం ఉదయం వచ్చి చూసే సరికి ఇబ్రహీం ఖాన్ తలకు బలమైన గాయాలతో హత్యకు గురైనట్లు కనిపించాడు. యజమానులు తెలిపిన ప్రకారం మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తితో గొడవ జరిగిందని, వారే ఈ హత్య చేసి ఉంటారన్న అనుమానంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టనున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు.

కూలర్ షాపులో హత్యకు గురైన వృద్ధుని మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here