నిస్వార్థంగా పరిపాలిస్తున్న ఏకైక పార్టీ బిజెపి – ఆవిర్భావ దినోత్సవంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మియపూర్, మాదాపూర్ డివిజన్ల లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ సాయి నగర్ లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజెపి నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన లైవ్ కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించడం జరిగింది. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతం‌ కోసం పాటుపడే పార్టీ బిజెపి పార్టీ అన్నారు. దేశ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా అవినీతి రహితంగా పాలన అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక పార్టీ బిజెపి అని చెప్పారు. దేశ రక్షణ, ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి దేశం ప్రథమం, పార్టీ ద్వితీయము తర్వాత వ్యక్తిగతం అని నమ్మి ఎలాంటి పదవులు, డబ్బుకి ఆశ పడకుండా పార్టీ సేవలో నిమగ్నమైన తోటి నాయకులకు, కార్యకర్తలకు బిజెపి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

బిజెపి జెండాను ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here