చందానగర్ ఎస్.బీ.ఐ ఏటీఏం లో రూ.12.86 లక్షలు చోరీ

గ్యాస్ వెల్డింగ్ తో ఏటీఎం మిషన్లు తెరిచిన దృశ్యం

చందానగర్( నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ ఏటీఎం లో భారీ చోరీ చోటు చేసుకుంది. 10 రోజులుగా మూసివున్న ఏటిఎం నుంచి ఏకంగా రూ 12.86 లక్షలు దోచుకెళ్లారు. చందానగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం చందా నగర్ బస్ స్టాప్ సమీపంలోని ఎస్.బీ.ఐ ఏటీఎం టెక్నికల్ ప్రాబ్లం వల్ల గత నెల 25 నుంచి మూసి ఉంది.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

కాగా సోమవారం ఈ సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ సిబ్బంది వచ్చి చూడగా ఏటీఎం మిషన్ ద్వంసం అయ్యి ఉంది. గ్యాస్ వెల్డింగ్  ను ఉపయోగించి మరి దుండగులు మిషన్ ను తెరిచారు. రూ.12.86 లక్షలు దోచుకెళ్లినట్టు బ్యాంకు సిబ్బంది బావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం గత నెల 26న చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చందానగర్ లో చోరీ జరిగిన ఏటీఎం ఇదే

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here