శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల ఎక్స్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం జూలై 21వ తేదీన గాంధీ హాస్పిటల్కు తరలించారు. అతను చికిత్స పొందుతూ జూలై 25వ తేదీన మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుని వయస్సు సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే 9490617118, 8712663184 ఫోన్ నంబర్లలో తమను సంప్రదించాలని సూచించారు.






