ప్ర‌మాద‌వ‌శాత్తూ బిల్డింగ్ మీద నుంచి ప‌డి యువ‌కుడు మృతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌మాద‌వ‌శాత్తూ ఓ యువ‌కుడు బిల్డింగ్ పైనుంచి కింద ప‌డి తీవ్ర‌గాయాల‌కు గురై అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉండే క‌మ‌ల‌నాథ‌న్ నంద‌కుమార్ అనే వ్య‌క్తి గ‌త 13 ఏళ్ల నుంచి ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌నుషుల‌ను తీసుకువ‌చ్చి ప‌నిచేయిస్తున్నాడు. అందులో భాగంగానే రాజ‌స్థాన్‌కు చెందిన కిశోర్ (25) అనే యువ‌కున్ని కూడా త‌న ద‌గ్గ‌ర ప‌నిలో పెట్టుకున్నాడు.

కిశోర్ (ఫైల్‌)

కిశోర్ మ‌రో 4 మంది బీహార్‌కు చెందిన వ్య‌క్తుల‌తో క‌లిసి చందాన‌గ‌ర్‌లోని నాగార్జున స్కూల్ స‌మీపంలో ఓ గ‌దిలో నివాసం ఉంటూ క‌మ‌ల‌నాథ‌న్ వ‌ద్ద ప‌నిచేస్తున్నాడు. కాగా ఈ నెల 15వ తేదీన ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ భ‌వ‌నం 2వ అంతస్తు నుంచి కింద‌ప‌డ్డాడు. దీంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. కాగా స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here