గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగండ్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి ఈ నెల 10 వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో లింగంపల్లి రైతు బజార్ వైపు చందానగర్ పోలీస్ సిబ్బంది నాగేంద్ర నాయుడు, శేఖర్ కలిసి విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న తరుణంలో బ్రిడ్జి చివరి భాగాన ప్రజలు గుమి‌కూడి ఉండడాన్ని గమనించి అక్కడకు వెళ్లి చూశారు. 65 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వ్యక్తి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్నాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైనట్లు సమాచారం. వెంటనే 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ నాగేంద్ర నాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here