ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన కార్పొరేటర్ రాగం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జిహెచ్ఎంసి నూతన పాలకమండలి ఎన్నిక కార్యక్రమంలో భాగంగా రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పూల మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న రాగం నాగేందర్ యాదవ్

రాగం ను సన్మానించిన శేరిలింగంపల్లి డివిజన్ అభిమానులు…

శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా డివిజన్ కు చెందిన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాగేందర్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తన విజయానికి అండగా నిలిచిన ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ డివిజన్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన తెలిపారు

రాగం ను గజమాలతో సత్కరిస్తున్న శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here