ఎస్సార్ ఎస్టేట్‌లో బీజేపీ అభ్య‌ర్థి రాఘవేంద్ర రావు సతీమణి లక్ష్మి పాదయాత్ర

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ ప‌రిధిలోని ఎస్సార్ ఎస్టేట్ లో డివిజ‌న్‌ బిజెపి అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు సతీమణి కర్లపూడి లక్ష్మి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బిజెపికి ఓటు వేయాలని ఓట‌ర్ల‌ను అభ్యర్ధించారు. తెరాస ప్ర‌భుత్వం గ‌త జీహెచ్ఎంఎసీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను మ‌రోసారి మ్యానిఫెస్టోలో పొందుప‌రిచింద‌ని, కొత్త‌గా ప్ర‌జ‌లకు ఇచ్చిన వాగ్దానాలు ఏవీ లేవ‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌ని పాల‌న‌ను అందించ‌డంతో తెరాస ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు ఆలోచించుకుని ఓటు వేయాల‌ని, బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఈ ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో దోనెపూడి రమాదేవి, వల్లభనేని రాజేశ్వరి పాల్గొన్నారు.

క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని మ‌హిళ‌ను కోరుతున్న ల‌క్ష్మి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here