ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని చక్రధర్ కాలనీ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 10వ రోజు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఉన్న సమస్యలను స్థానికులు కార్పొరేటర్కు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు మొదలైన పనులు పూర్తవ్వడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ను అభినందించారు. కాగా మిగలిన చిన్నప్యాచ్ వర్కు పనులను కూడా త్వరగా పూర్తి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డు నెంబర్ కాశీనాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, కాలనీ ప్రెసిడెంట్ తిరుపాల్రెడ్డి , వెంకట్ రెడ్డి, ఎలమంద, సుభాష్, ప్రసాద్ రావు, దస్తగిరి, సూర్య చంద్ర, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.