నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • కొండాపూర్, మాదాపూర్ డివిజన్ల పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కాలనీ లో రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా పరిశీలించారు.

ప్రేమ్ నగర్ బి బ్లాక్ కాలనీ లో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

అనంతరం మాట్లాడుతూ ప్రేమ్ నగర్ బి బ్లాక్ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని, కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అదేవిధంగా మాదాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులను ఆదేశించారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదిల్ పటేల్, శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, రజినీకాంత్, ఇమామ్, ఈరమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

  • గోకుల్ ప్లాట్స్ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీలలో ..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీలలో రూ. 65 లక్షల అంచనావ్యయం తో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, రజినీకాంత్,బాబు మియా, ఖాసీం, రహీం, లియకాత్, సలీమ్, కాజా,సోహెల్, మునఫ్ సాజిద్, అమీర్ , కాలనీ వాసులు పాల్గొన్నారు.

గోకుల్ ప్లాట్స్ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here