మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతోపాటు కాలనీవాసులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శ్రీకల, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజ్ లింగయత్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మహేష్ రాపన్, సీనియర్ నాయకులు సుధాకర్, ఉమాకాంత్, మహిళా నాయకురాలు రోజా, లక్ష్మి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్ప కాలనీలో జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, కాలనీవాసులతో కలిసి సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here