రాయదుర్గంలో బిజెపి “సేవ సప్తహ”

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవ సప్తాహ కార్యక్రమాన్ని సోమవారం రాయదుర్గంలో నిర్వహించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిజెపి నాయకులు మూల అనిల్ గౌడ్ సహకారంతో రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన “సేవ సప్తాహ” కార్యక్రమంలో భాగంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళాద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నీలం నరేందర్ ముదిరాజ్, నక్క నరేందర్ గౌడ్, సతీష్ గౌడ్, మహేందర్ గౌడ్, దయాకర్, పి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ నక్క శివ కుమార్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ నక్క సామ్రాట్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here