ఖాజాగూడ వ‌ద్ద యూట‌ర్న్ ఏర్పాటు చేయండి – ట్రాఫిక్ డీసీపీకి బీజేపీ నాయ‌కుల విన‌తి

డీసీపీ కార్యాల‌యం వ‌ద్ద విన‌తి ప‌త్రంతో బిజేపీ నాయ‌కులు

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని ఖాజా గూడా గ్రామంలో తొల‌గించిన యూట‌ర్న్ ను తిరిగి ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ డివిజ‌న్ బీజేపీ నాయ‌కులు ట్రాఫిక్ డీసీపీ విజ‌య‌కుమార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఖాజాగుడ ప్ర‌భుత్వ పాఠ‌శాల నుంచి రత్నదీప్ సూప‌ర్ మార్కెట్ మ‌ద్య‌లో మెయిన్ రోడ్డు పై యూ టర్న్ తొలిగించడం వల్ల గ్రామ ప్రజలుకు రోడ్డు దాటుటకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. గ్రామ‌స్థుల అవ‌స‌రాల కొసం డివైడ‌ర్ కొంత‌మేర తొల‌గించాల‌ని కోరారు. డీసీపీ సానుకూలంగా స్పందించిన‌ట్టు వారు తెలిపారు. డివిజ‌న్ బిజేవైఎం అధ్యక్షులు నక్క శివ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు కంచ మీది కృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు మూల అనిల్ గౌడ్, రంగని విష్ణు నక్కసామ్రాట్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here