నమస్తే శేరిలింగంపల్లి : మర్రిగూడ మార్గంలో బిజెపి నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ఇందులో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తో కలిసి బీజేపీ యాదాద్రి భువనగిరి డీటీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, నంద కుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. మునుగోడు సమగ్రాభివృద్ధి కోసమే పదవి త్యాగం చేసిన రాజగోపాల్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.