బాబ్రీ మసీదు కేసు కొట్టివేతపై బిజెపి నాయకుల హర్షాతిరేకాలు

మిఠాయిలు పంచుకుంటున్న బిజెపి నాయకులు

వివేకానందనగర్(నమస్తే శేరిలింగంపల్లి): బాబ్రీ మసీదు కూల్చివేతపై గల కేసును కొట్టివేస్తూ నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వివేకానందనగర్ బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ లో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో దాదాపు 28 సంవత్సరాల క్రితం రామమందిర నిర్మాణంలో భాగంగా బాబ్రీ మసీదును కూల్చిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని సుప్రీం కోర్టు ఈ రోజు కేసు కొట్టివేయడం శుభపరిణామమన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో . డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు ధర్మారావు, నామాల శ్రీనివాస్ ,
భాస్కర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు, నరేష్ , అరవింద్ యాదవ్, సాయి, పుష్పేందర్, శ్రీనివాస్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here