నగర ప్రజలకు ట్రాఫిక్ రహిత రవాణా సౌకర్యాల ఏర్పాటుకు కృషి: మేయర్ బొంతు రామ్మోహన్

పర్యటనలో ప్రభుత్వ విప్ గాంధీతో నగర మేయర్ బొంతు రామ్మోహన్

ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): నగర వాసులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించేలా పలు రహదారులను అభివృద్ధి పరుస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద లేక్ వ్యూ బార్ నుండి అడ్డగుట్టకు వెళ్లే ఎల్లమ్మ చెరువు రోడ్డు నిర్మాణం, నిజాంపేట్ లోని మోర్ సూపర్ మార్కెట్ రోడ్ల ఏర్పాటు పై మేయర్ ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ తో కలిసి క్షేత్ర స్థాయు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ గారు మాట్లాడుతూ రహదారుల సమస్యలను పరిష్కరిస్తానని, త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ రోడ్లను న్యాయపరమైన సమస్యలు లేకుండా నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని మేయర్ గారు అధికారులకు తెలియచేసారు. ఎన్నో ఏండ్ల నుండి పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో అధికారులు ఎస్ ఈ శంకర్ నాయక్, డీఈ గోవర్ధన్, ఏఈ సుభాష్,మరియు డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here