భార‌త‌దేశంలో స‌నాత‌న ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తిఒక్క‌రూ పాటుప‌డాలి: బేరి రామచందర్ యాదవ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ‌భార‌తదేశంలో ప్ర‌తీ హిందువు స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డాల‌ని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నఆయ‌న ఆల‌య క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి నూత‌న సంవత్స‌ర క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా రామ్ చంద‌ర్ యాద‌వ్‌ మాట్లాడుతూ భారతీయులందరూ ప్రతి ఒక్కరూఐక్యమత్యంతో భారతదేశం గొప్పతనం నీ చాటి చెప్పాలన్నారు అని అన్నారు. అమ్మవార్ల కరుణా కటాక్షాలు అందరిమీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరిన‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దేవస్థానం చైర్మన్ ఈ రవి ప్రకాష్ గౌడ్ బేరి రామచందర్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు కే అశోక్ యాదవ్, బేరి శ్రీనివాస్ యాదవ్, ఆలయ మాజీ ధర్మకర్త బుజ్జి యాదవ్, రఘు యాదవ్, చిన్న స్వామి యాదవ్, ఈదన్న యాదవ్, భాస్కర్ యాదవ్, వీరారెడ్డి., శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆల‌య క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి క్యాలెండ‌ర్ ఆవిష్క‌రిస్తున్న భేరి రామ్ చంద‌ర్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here