కాంగ్రెస్ రావడం ఖాయం : ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతి నగర్ డివిజన్ లోని ఓల్డ్ ఎం.ఐ.జిలో నిర్వహించిన రోడ్ షో, బైక్ రాలీ ప్రజల మద్దతు కూడగట్టుకున్నది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు.

మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు

తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, మార్పు కోరుకుంటున్నారని, ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టే సూచనలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

ప్రజలను పలకరిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.

బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here