డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, చందానగర్ జిహెచ్ఎంసి సర్కిల్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు, కేవీపీఎస్ నాయకులు కొంగరి కృష్ణ, శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ప్రజలందరికీ మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహా నేత అంబేద్కర్ అని అన్నారు. భారతదేశం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి భారత రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతుందని వారు కొనియాడారు.

చందానగర్ జిహెచ్ఎంసి సర్కిల్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిఐటియు, కేవీపీఎస్ నాయకులు కొంగరి కృష్ణ, శ్రీనివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here