ప్రత్యామ్నాయ , లింక్ రోడ్లను వెంటనే చేపట్టండి : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో  జీహెచ్ ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనుల పై చర్చించారు ప్రభుత్వ విప్ గాంధీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న జనవాసాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యల పై నియోజకవర్గంలో చేపట్టబోయే ప్రత్యామ్నాయ రోడ్లు, లింక్ రోడ్లను వెంటనే చేపట్టాలని, రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, స్థితిగతుల పై చర్చించారు.


సీసీపీ తో చర్చించిన అంశాలు :
1.చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ రోడ్ విస్తరణ పనులు.
2.మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుడి వయా యశోద హాస్పిటల్ వరకు రోడ్ విస్తరణ
3.చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం హనుమాన్ గుడి నుండి అపర్ణ వరకు లింక్ రోడ్డు
4. జెఎన్ టియు నుండి ప్రగతి నగర్ వరకు వయా హెచ్ఎంటి హిల్స్ రోడ్డు నిర్మాణ పనులు
5.ఆస్బెస్టాస్ కాలనీ రివైజ్డ్ లే ఔట్
6. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ లోని మోర్ సూపర్ మార్కెట్ రోడ్
7. నాగార్జున హోమ్స్ నిజాంపేట్ రోడ్డు టీడీఆర్ లకు చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ సానుకూలంగా స్పందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here