శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన రఘునాథ్ యాదవ్ ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగ కృష్ణ, మోహిజ్, పరదేశి నాయుడు, సాయి, త్రిలోచన్ తదితరులు పాల్గొన్నారు.






