శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాసనూరి లక్ష్మి రాజు యాదవ్ నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను యాదవ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు పెరుగు రమేష్ యాదవ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి గణేష్ యాదవ్, రామచంద్రపురం అధ్యక్షుడు లకడారం మల్లేష్ యాదవ్, ఒగ్గు కృష్ణ యాదవ్, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






