శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ సందర్భంగా రవీంద్ర భారతిలో జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళ ఆవార్డు, దళిత రత్న, నంది, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కాటేపోగు బాల సుబ్బమ్మకి 2026వ మహిళా లెజెండ్ అవార్డుని అందజేశారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇస్తున్న జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అవార్డు వచ్చిన బాల సుబ్బమ్మకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.






