శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మదీనాగూడ డివిజన్ నూతనంగా ఏర్పాటు కావడంతో తనకు ఆ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పార్టీ నాయకులను నియోజకవర్గం మండల ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులు కొల్లూరు మల్లేష్ యాదవ్, జనార్దన్ గౌడ్, గోపాల్, జి వెంకటేష్ ని కలిసి మద్దతు తెలపాలని కోరారు.






