బీజేపీ జెండానే అండ: కర్లపూడి రాఘవేంద్ర రావు

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేట‌ర్ హైద‌రాబాద్ వాసుల‌కు బీజేపీ జెండానే అండ‌గా ఉంటుంద‌ని ఆ పార్టీ మియాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు అన్నారు. మంగ‌ళ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని ప్రజ‌య్ షెల్టర్, రెడ్డి ఎన్‌క్లేవ్, బీకే ఎన్‌క్లేవ్, మయూరి నగర్, కేంద్రీయ విహార్ లలో ఆయ‌న పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిప్ర‌జ‌ల‌ కష్టాలను స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట బీజేపీకి ప్రజలనుంచి సంపూర్ణ మద్దతు లభించింద‌ని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. బీజేపీకి ఓటు వేసి హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

మియాపూర్ డివిజ‌న్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న బీజేపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు
అపార్ట్‌మెంట్ వాసుల‌కు అభివాదం చేస్తున్న కర్లపూడి రాఘవేంద్ర రావు

న‌డిగ‌డ్డ తండాలో సౌజన్య పాద‌యాత్ర‌…
మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని న‌డిగ‌డ్డ తండాలో డివిజ‌న్ బిజెపి అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు కుమార్తె సౌజన్య పాదయాత్ర నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాల‌ని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జ‌ల‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. యువ‌త‌కు బీజేపీ భ‌రోసానిస్తుంద‌ని అన్నారు. క‌మ‌లం పువ్వుకు ఓటు వేసి ప్ర‌జ‌లు అభివృద్ధి ఫ‌లాల‌ను అందిపుచ్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేయాల‌ని కోరారు.

న‌డిగ‌డ్డ తండాలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న కర్లపూడి రాఘవేంద్ర రావు కుమార్తె సౌజన్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here