శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారాం సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బొబ్బ నవతా రెడ్డి ఆధ్వర్యంలో KTR సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని KTR చెప్పారని సునీల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, గంగారాం సంగారెడ్డి, చందర్ రావు, గౌస్, అనంత రెడ్డి, ఫయస్ తదితరులు పాల్గొన్నారు.






