శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్, మియాపూర్ ఫోటో అండ్ వీడియోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఫోటో EXPO -2025 పోస్టర్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, కూకట్ పల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్, మియాపూర్ ఫోటో అండ్ వీడియోస్ అసోసియేషన్ సభ్యులు రాజిరెడ్డి , విజయ్, దుర్గా ప్రసాద్, హన్మంత్ రెడ్డి, కృష్ణా రావు, సత్యం, హర్ష, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






