శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 14వ తేదీన మియాపూర్ దీప్తిశ్రీనగర్లోని శ్రీధర్మపురి క్షేత్రంలో చావడి చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సొసైటీ చీఫ్ ప్యాట్రన్ భారతీయం సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు నారా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.





