హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్

హఫీజ్ పేట్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ ప‌రిధిలోని హుడాకాలనీలో డివిజ‌న్ బిజెపి కార్పొరేట‌ర్‌ అభ్యర్థి బోయిని అనూష యాదవ్ ఆదివారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంఏ పాలిటిక్స్ చదువు పూర్తయిన అనూష యాదవ్ మంచి రాజకీయ కుటుంబం నుండి వచ్చిన అభ్యర్థి అని అన్నారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకుని తీర్చిదిద్దే విషయంలో అనుభవం ఉన్న గల అభ్యర్థి అని అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.హైదరాబాద్ మహానగరాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వినయ, పార్వతి, దుర్గ నరేందర్, నర్సింహా, పృథ్వి, దేవేందర్, నందు, సాయి చరణ్, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హ‌ఫీజ్‌పేట హుడా కాల‌నీలో ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, డివిజ‌న్ బిజెపి కార్పొరేట‌ర్‌ అభ్యర్థి బోయిని అనూష యాదవ్
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న జ్ఞానేంద్ర ప్రసాద్, బోయిని అనూష యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here