- ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీత రెడ్డి, డివిజన్ తెరాస అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, భవానిపురం, సురక్ష ఎన్ క్లేవ్, అర్జున్ రెడ్డి, శిల్ప ఎన్ క్లేవ్ ప్రాంతాల్లో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ సునీత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో తమకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ఈసారి తమకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫించన్లు, మహిళలల భద్రత కోసం షి టిమ్స్, భోరసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ప్రజలకు 24 గంటల కరెంటు, తాగు నీరు అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చందానగర్ డివిజన్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దూబే, ఉరిటి వెంకటరావు, తుడి ప్రవిణ్, ఓ.వేంకటేష్, జనార్ధన్ రెడ్డి, ధనలక్ష్మి పాల్గొన్నారు.