శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వినాయక చవితి సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సుమేధ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుంధతి షెనాయ్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి, వినాయక కౌతం జతిస్వరం, అలరిపు, విష్ణు కీర్తనం, దుర్గ కీర్తనం, కృష్ణ కీర్తనం మంగళం తదితర అంశాలను ప్రదర్శించి మెప్పించారు. లలిత, జనిత్రి, సాయి సంహిత, అవని, ఆద్మ, దృతి, దిశా, యశస్వినీ, ఇషితా, శ్రీనిక, సంహిత అహనా ఈ నృత్యాలను ప్రదర్శించి మెప్పించారు.






