శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఘ‌నంగా దేవీ న‌వ‌రాత్రులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ ధర్మపురి క్షేత్రం నూతన రహదారిని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు అయిన గుణంపల్లి రాఘవ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారి ఊరేగింపు సహితంగా ప్రారంభోత్సవం చేశారు.

ర‌హ‌దారిని ప్రారంభిస్తున్న రాఘ‌వ‌రెడ్డి

అఖండ దీపారాధన జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమం గొట్టిపాటి శ్రీనివాస్, అట్లూరి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. అమ్మవారు త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు.

అమ్మ‌వారి ఊరేగింపు నిర్వ‌హిస్తున్న దృశ్యం

శ్రీ చక్ర పూజలతో, కుంకుమార్చనలతో, హోమాలతో అభిషేకాలతో అమ్మవారి శరన్నవరాత్రులలో మొదటిరోజు సాయంకాలం స్వరరాగ మ్యూజిక్ అకాడమీ చిన్నారుల సంగీతంతో ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు.

అల‌రిస్తున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here