స‌మ‌స్య ఏదైనా ప‌రిష్కారం కోసం కృషి చేస్తా: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సమస్య ఏదైనా పరిష్కారం కోసం కృషి చేస్తాన‌ని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో నెలకొన్న సమస్యలపై స్థానికులతో కలిసి ఆయ‌న పాద‌యాత్ర చేశారు. స‌మ‌స్య‌ల‌ను పరిశీలించారు.

బ‌స్తీలో పేరుకుపోయిన చెత్త‌ను ప‌రిశీలిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బస్తీ, కాలనీలలో నెలకొన్న సమస్యలను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యర్ధాల తొలగింపు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్క‌రించే విధంగా కృషి చేస్తాన‌ని తెలిపారు. మిగతా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు విక్రమ్ చారి, చెన్నయ్య సాగర్, శివ గౌడ్, లక్ష్మీ బాయి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

బ‌స్తీ వాసుల‌తో క‌లిసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here