బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ క‌ల్పించాల‌ని కోరుతూ బిసి జన సమితి ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బీసీ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు ఆర్‌కే సాయ‌న్న ముదిరాజ్‌, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్య‌క్షుడు భేరి రామ‌చంద్ర యాద‌వ్‌, జ‌స్వంత్‌లు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అనంత‌రం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండ రామ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని అన్నారు. తాను ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రితో మాట్లాడుతాన‌ని హామీ ఇచ్చారు. బీసీల‌కు అన్ని విధాలుగా న్యాయం చేస్తామ‌ని తెలిపారు.

ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌కు విన‌తిప‌త్రం అందజేస్తున్న భేరి రామ‌చంద్ర యాద‌వ్‌, ఆర్‌కే సాయ‌న్న ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here