నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని మంత్రి సత్యవతి రాథోడ్, ఉప్పల్ నియోజకవర్గ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆయన సతీమణి శ్యామల దేవి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తమ నియోజకవర్గ ప్రజలకు చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , రాము పాల్గొన్నారు.