నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పేరిందేవి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఆనంద నర్తన గణపతిమ్, కాలభైరవాష్టకం, ఝేమ్ ఝేమ్ తనను, ఇట్టి ముద్దులాడేయ్, కొలువిడి గణపతిమ్, తారంగం, మహేశ్వరి మహా కాళీ, కళింగ నర్తన, శ్రీ విజ్ఞ రాజాం భజేయఁ, మొదలైన అంశాలను డాక్టర్ పేరిందేవి, గ్రీష్మ, హన్షిక, రాజేశ్వరి, చైత్రిక, అరుణిమ, భావన మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.