నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. మునుగోడు మండలం కల్వలపల్లీ , బిరెల్లిగుడెం , పులిపలుపుల, జమస్తాన్ పల్లీ, గుండ్లోరి గూడెం, గుడాపుర్, కొరటికల్, దుబ్బకల్వ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మునుగోడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , చాడా సురేష్ రెడ్డి, బోడిగే శోభాతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.