నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ఆచార , సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పర్వదినాన్ని మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆయన సతీమణి సుమతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, అయన సతీమణి శ్యామల దేవి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్ రావు, BSN కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజు, మహేందర్ ముదిరాజు, శ్రీనివాస్ గోపారాజు, కాజా, మల్లేష్, రామ ప్రభు, శివ, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా, సుప్రజ, వరలక్ష్మి, కల్పన, స్వరూప, ఉమాదేవి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






