నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ, దసరా ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత చీరలు మగువల మనసును దోచుకుంటున్నాయి. బొమ్మలకొలువు చూపరులను ఆకర్షిస్తున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ” సద్యోనీ ” డాన్స్ అకాడమీ గురువు ఆశ్రిత వేముగంటి కుమారి వైష్ణవి కాలసపాక్కం శిష్య బృందం చే భరతనాట్య నృత్య ప్రదర్శన చేశారు. ఇందులో భాగంగా భరతనాట్యం మార్గంలో మహాగణపతిమ్ , ఆనంద నర్తన , అలరిపు , దేవి అష్టకం, ముద్దుగారే యోషాడ, జయ జానకి రమణ, శ్లోకలు , మధురాష్టకం, తందనానా, తిల్లాన, మంగళం అంశాలను ప్రదర్శించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా డాక్టర్ బిందు అభినయ శిష్యులు వినాయక స్తుతి, నటేశ కౌతం, సరస్వతి కీర్తన, కొలువైతివారంగా సాయి, కళ్యాణి తరంగం, రామదాసు కీర్తన, హిందోళం తిల్లాన, కామాక్షి స్తుతి, మొదలైన అంశాలను ప్రదర్శించారు.

