సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు.. వేడుకగా బతుకమ్మ

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో  స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ, దసరా ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత చీరలు మగువల మనసును దోచుకుంటున్నాయి. బొమ్మలకొలువు చూపరులను ఆకర్షిస్తున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  ” సద్యోనీ ” డాన్స్ అకాడమీ గురువు ఆశ్రిత వేముగంటి కుమారి వైష్ణవి కాలసపాక్కం  శిష్య బృందం చే భరతనాట్య నృత్య ప్రదర్శన చేశారు. ఇందులో భాగంగా భరతనాట్యం మార్గంలో   మహాగణపతిమ్ , ఆనంద  నర్తన , అలరిపు , దేవి అష్టకం, ముద్దుగారే  యోషాడ, జయ  జానకి  రమణ, శ్లోకలు , మధురాష్టకం,  తందనానా, తిల్లాన,  మంగళం అంశాలను ప్రదర్శించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా డాక్టర్ బిందు అభినయ శిష్యులు వినాయక  స్తుతి, నటేశ కౌతం, సరస్వతి కీర్తన, కొలువైతివారంగా సాయి, కళ్యాణి తరంగం, రామదాసు కీర్తన, హిందోళం తిల్లాన, కామాక్షి స్తుతి, మొదలైన అంశాలను ప్రదర్శించారు.

భరతనాట్య ప్రదర్శనలో కళాకారులు
మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మలతో మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here