నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ గా మన్నె సతీష్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ నియామపకపు పత్రాన్ని అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మన్నె సతీష్ ను రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ గా నియమించడంతో పాటు కో ఆర్డినేటర్లుగా పి. నవీన్, ఎన్. పవన్ కుమార్, సిందు శంకర్, రఘురాంరెడ్డి, ఉజ్వల్ రెడ్డి లను నియమించారు. సతీష్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా చేరేలా కృషి చేస్తామని అన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.